Thursday, May 9, 2024

Miss Universe: భారత యువతికి మిస్ యూనివర్స్ కిరీటం

భారత యువతి హర్నాజ్ సంధు ప్రపంచ వేదికపై సత్తాచాటింది. 2021 ఏడాదికిగానూ మిస్ యూనివర్స్​గా నిలిచింది. ఇజ్రాయెల్ వేదికగా జరిగిన 70వ మిస్‌ యూనివర్స్‌ పోటీల్లో అందరినీ వెనక్కినెడుతూ మిస్ యూనివర్స్ కిరీటం దక్కించుకుంది. దీంతో 21 ఏళ్ల తర్వాత భారత్​కు ఈ టైటిల్ దక్కింది. చివరిసారిగా 2000లో లారా దత్తా మన దేశం తరఫున ఈ కిరీటం దక్కించుకుంది. తాజాగా 2021లో పంజాబ్ కు చెందిన హర్నాజ్‌ సింధు మిస్‌ యూనివర్స్‌గా ఎంపికైంది. గత ఏడాది మిస్‌ యూనివర్స్‌గా ఎంపికైక ఆండ్రియా మెజా.. హర్నాజ్‌ సింధుకు కిరీటాన్ని బహుకరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement