బీజింగ్ లో జరిగే వింటర్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవానికి కానీ, ముగింపు వేడుకలకు కానీ భారత్ తరఫున రాయబారి హాజరుకాబోరని మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చయోన్ చెప్పారు. 2022 వింటర్ ఒలింపిక్స్ కు గాల్వాన్ సైనికుడిని టార్చ్ బేరర్గా చైనా తయారు చేస్తుందన్న నివేదికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఒలింపిక్స్ ను రాజకీయం చేయడానికి చైనా ఎంచుకోవడం విచారకరం అన్నారు.
గత ఏడాది జూన్లో గాల్వాన్ లోయలో భారత బలగాలపై దాడి చేసేందుకు ప్రయత్నించినప్పుడు క్విఫాబావోని ఇండియన్ సోల్జర్స్ పట్టుకున్నారని ఓ వార్తా సంస్థ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లో పేర్కొంది. ఆ నివేదిక ప్రకారం.. గత ఏడాది జూన్ 15-16 తేదీల మధ్య చీకట్లో గాల్వాన్ నదిని దాటడానికి 38 మంది చైనా సైనికులు ప్రయత్నించారు. అప్పుడు భారత, చైనా దళాల మధ్య ముఖాముఖిగా పోరాటం జరిగింది. కాగా, భారత బలగాలపై దాడికి పాల్పడ్డ చైనా దళానికి క్వి ఫాబావో నాయకత్వం వహించాడు. ఈ సందర్భంగా జరిగిన పోరాటంలో గాల్వాన్ వ్యాలీలో మోహరించిన భారత బలగాల్లో స్నో లెపార్డ్ అయిన కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు ఈ ఆపరేషన్ లో మరణించిన విషయం తెలిసిందే.