Saturday, May 4, 2024

ఇండియాలో కరోనా థర్డ్ వేవ్ ఖతం.. కొత్తగా 10 వేల దిగువన పాజిటివ్ కేసులు

దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 8,013 కరోనా​ కేసులు నమోదయ్యాయి. కరోనాతో మరో 119 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,13,843కి చేరింది. కొవిడ్​ నుంచి మరో 16,765 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు మొత్తం 4,23,07,686 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. దేశంలో పాజిటివిటీ రేటు 1.11 శాతంగా ఉంది. ఇక, దేశంలో ప్రస్తుతం 1,02,601 యాక్టివ్​ కేసులు ఉన్నాయి. దేశంలో వ్యాక్సినేషన్​ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు మొత్తం 1,77,50,86,335 కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశారు. నిన్న ఒక్కరోజే 4,90,321 డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement