Friday, April 26, 2024

మంచు విష్ణు ఆఫీస్‌లో చోరీ… రూ.5లక్షలు విలువ చేసే సామాగ్రి మాయం..

ప్రముఖ సినీనటుడు, ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు కార్యాలయంలో భారీ చోరీ జరిగింది. ఈ మేరకు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు అందింది. రూ.5 లక్షలు విలువ చేసే హెయిర్ డ్రెస్సింగ్ సామాగ్రి చోరీకి గురైనట్లు ఆయన మేనేజర్ సంజయ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విష్ణు వద్ద హెయిర్ డ్రెస్సర్‌గా పనిచేసే నాగ శ్రీనుపై అనుమానం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. చోరీ జరిగినప్పటి నుంచి నాగ శ్రీను కనిపించడం లేదని, ఈ చోరీ వెనక అతడు ఉండొచ్చని ఫిర్యాదులో ఆయన అనుమానం వ్యక్తం చేశారు. చోరీ కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement