Sunday, April 28, 2024

India Corona: దేశంలో కరోనా కేసులు ఎన్నంటే..

దేశంలో కరోనా కేసులు తగ్గుతున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌ ప్రకారం… గత 24 గంటల్లో కొత్తగా 7,081 కరోనా కేసులు వెలుగు చూశాయి. మరో 264 మంది కోవిడ్‌ బాధితులు ప్రాణాలు వదిలారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 4,77,422కు చేరుకుంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 7, 469 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 

దేశంలో కరోనా పాజిటివిటి రేటు 98.36 శాతంగా ఉంది. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,47,40,275కు చేరింది. ఇందులో 3,41,78,940 మంది బాధితులు కోవిడ్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 83,913 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ కొనసాగుతోంది. నిన్న ఒక్క రోజే 76,54,466 మందికి టీకా వేశారు. ఇప్పటి వరకు 1,37,46,13,252 మందికి పైగా టీకా వేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement