Sunday, May 5, 2024

India Corona: దేశంలో కొత్తగా 6,987 కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు మరోసారి తగ్గాయి. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 6,987 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో 162 మంది మరణించారు. అదే సమయంలో 7,091 మంది బాధితులు కోలుకున్నారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య 3,47,86,802కి చేరింది. ఇందులో 3,42,30,354 మంది బాధితులు పూర్తిగా కోలుకున్నారు.

ప్రస్తుతం దేశంలో 76,766 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక, ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 4,79,682 మంది బాధితులు కోవిడ్ తో ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు దేశంలో వ్యాక్సిన్ ల పంపిణీ కూడా శరవేగంగా కొనసాగుతోంది.  దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,41,37,72,425కు చేరిందని కేంద్ర వైద్యారోగ్య శాఖ పేర్కొంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement