Tuesday, May 7, 2024

Militants killed: జమ్మూకాశ్మీర్ లో భారీ ఎన్ కౌంటర్.. 4 ఉగ్రవాదులు హతం

జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా వరసగా ఎన్ కౌంటర్ల చోటు చేసుకుంటున్నాయి. తాజాగా దక్షిణ కాశ్మీర్‌లోని షోపియాన్, పుల్వామాలో జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో నలుగురు ఉగ్రవాదులు హతమైయ్యారు. శనివారం సాయంత్రం అనంత్‌నాగ్‌లో జరిగిన ఎదురు కాల్పుల్లో మరో ఉగ్రవాదిని కూడా భద్రతా బలగాలు హతమార్చాయి.

అంతకుముందు.. షోపియాన్ జిల్లాలో ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులు మృతి చెందగా.. పుల్వామాలోని త్రాల్‌లో ఇద్దరు అన్సార్ గజ్వతుల్ హింద్ ఉగ్రవాదులు హతమయ్యారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement