Monday, April 29, 2024

Covid-19: దేశంలో కరోనా విలయతాండవం.. 50 వేల మార్క్ దాటిన కేసులు

దేశంలో కరోనా మహమ్మారి కేసులు మళ్లీ విజృంభిస్తున్నాయి. మొన్నటి వరకు తగ్గిన కరోనా కేసులు.. తాజాగా 50 వేలు దాటాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన తాజా బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 58,097 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో 534 మంది కరోనా తో మరణించారు.దీంతో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 4,82,551కి చేరింది.

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 15,389 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు మొత్తం కోలుకున్న వారి సంఖ్య 3,43,21,803కి చేరింది. ప్రస్తుతం దేశంలో 2,14,004 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో కరోనా రోజువారీ పాజిటివిటి రేటు 4.18 శాతంగా ఉంది. దేశంలో మొత్తం 147.72 కోట్ల కరోనా డోసులు అందించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement