దేశంలో కరోనా మహమ్మారి కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించిన ప్రకారం గడచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 4,362 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా వల్ల 66 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో లో కరోనా నుంచి 9,620 మంది బాధితులు పూర్తిగా కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య మొత్తం 4,23,98,095 కు చేరింది.
ప్రస్తుతం దేశంలో 54,118 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 0.71 శాతంగా ఉంది. ఇప్పటి వరకు మొత్తం 178.90 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు వినియోగించినట్లు తెలిపింది.