దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగుతున్నాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన తాజా బులిటెన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో 27,553 కొత్త కేసులు నమోదు అయ్యాయి. అదే సమయంలో 284 మంది కోవిడ్ తో ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 4,81,080కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 9,249 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
ఇప్పటి వరకు మొత్తం కోలుకున్న వారి సంఖ్య 3,42,45, 561కు చేరింది. దేశంలో ప్రస్తుతం 1,22,801 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో కరోనా పాజిటివిటి రేటు 98.36 శాతంగా ఉంది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,45,44,13, 005 మందికి కరోనా వ్యాక్సిన్లు అందిచినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital