Monday, May 6, 2024

Covid: దేశంలో కరోనా విలయతాండవం.. ఒక్క రోజే 2.38 లక్షల కేసులు

దేశంలో కరోనా థర్డ్‌ వేవ్‌ విలయ తాండవం చేస్తుంది. రోజుకు లక్షకు తగ్గకుండా కరోనా కేసులు విపరీతంగా పెరిగి పోతున్నాయి. ఇక తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 2,38,018 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో తాజాగా 310 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మృతుల సంఖ్య 4,84,246 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1,57,421 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

దేశంలో 17,36,628 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరోవైపు ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 8891 ఒమిక్రాన్‌ కేసులు నమోదు అయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement