Friday, April 19, 2024

Flash.. Flash: తెలంగాణ ఛ‌త్తీస్‌గ‌ఢ్ బోర్డ‌ర్ లో భారీ ఎన్‌కౌంట‌ర్‌..

తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా ఏజెన్సీలో భారీ ఎన్‌కౌంట‌ర్ జ‌రిగిన‌ట్టు స‌మాచారం. తెలంగాణ‌, ఛ‌త్తీస్‌గ‌ఢ్ బోర్డ‌ర్‌లో పోలీసులు, మావోయిస్టుల మ‌ధ్య కాల్పులు జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. ములుగు జిల్లాలోని వెంకటాపురంమండలంలోని స‌రిహ‌ద్దు ప్రాంతంలోని క‌ర్రిగుట్టల వద్ద ఈ ఎన్ కౌంటర్ జ‌రిగిన‌ట్టు ప్రాథ‌మికంగా స‌మాచారం అందుతోంది.

దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. తెలంగాణ సాయుధ బలగాలు ఈ ఆపరేషన్ లో పాల్గొన్నట్లు సమాచారం. కాగా, ఇద్దరు మావోయిస్టులు చనిపోయినట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement