Tuesday, April 30, 2024

Good News: దేశంలో కొత్తగా 14 వేల కరోనా కేసులు

దేశంలో కరోనా మహమ్మారి కేసులు క్రమ క్రమంగా తగ్గిపోతున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో కేవలం 14,148 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,28,81,179 కు చేరింది. దేశంలో తాజాగా 302 మంది కరోనా తో మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 5,12,924 కి పెరిగింది.

గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 30 వేల మంది కరోనా నుంచి కోలు కున్నారు. దీంతో ఇప్పటివరకు దేశవ్యా ప్తంగా రికవరీ అయిన వారి సంఖ్య 4,22,19,896 కు చేరింది. ఇక దేశంలో ప్రస్తుతం 1,48,359 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో కరోనా పాజిటివిటి రేటు 97.82 శాతంగా ఉంది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,76,52,31,385 మందికి కరోనా వ్యాక్సిన్లు అందించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement