Sunday, April 28, 2024

India Corona: మళ్లీ పెరిగిన కరోనా కేసులు..ఒక్క రోజే 470 మంది మృతి

దేశంలో కరోనా కేసులు మళ్లీ స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో 12,32,505 మందికి కోవిడ్ టెస్టులు నిర్వహించగా 11,919 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇదే సమయంలో 11,242 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. నిన్న ఒక్క రోజే కరోనాతో 470 మంది మృతి చెందారు. తాజా మరణాల్లో 388 కేరళలోనే నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు దేశంలో మృతి చెందిన వారి సంఖ్య 4,64,623కి చేరుకుంది. ప్రస్తుతం దేశంలో 1,28,762 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసులు 0.37 శాతం ఉన్నాయి. మొత్తం కేసుల సంఖ్య 3,44,78,517కు చేరాయి. ఇందులో 3,38,85,132 మంది బాధితులు వైరస్‌ నుంచి కోలుకున్నారు. 

మరోవైపు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. నిన్న 73.4 లక్షల మంది టీకా వేశారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా దాదాపు 114 కోట్ల డోసుల వ్యాక్సిన్ వేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement