Friday, April 26, 2024

Corona Update: దేశంలో కొత్త 10,549 కేసులు.. 488 మరణాలు

దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గత రెండు, మూడు రోజులుగా 10 వేల లోపు కేసులు నమోదు కాగా.. తాజాగా కేసుల సంఖ్య పెరిగాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులిటెన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో 10,549 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. నిన్న ఒక్క రోజులో క‌రోనాతో 488 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమంయలో క‌రోనా నుంచి మ‌రో 9,868 మంది కోలుకున్నారు.

ప్ర‌స్తుతం 1,10,133 యాక్టివ్ కేసులున్నాయి. మొత్తం కేసుల సంఖ్య‌ 3,45,55,431కి చేరింది. ఇందులో 3,39,77,830 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. ఇప్పటి వరకు మొత్తం  4,67,468 మంది వైరస్ మృతి చెందారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement