Thursday, April 25, 2024

చిరంజీవి ట్వీట్ పై స్పందించిన మంత్రి పేర్ని నాని

సినిమా టికెట్ల రేట్లు పెంచాల‌ని చిరంజీవి ట్వీట్ పై ఏపీ స‌ర్కార్ స్పందించింది. చిరంజీవి జీవో 35లో కొన్ని మార్పులు చేయాల‌ని సూచించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రి పేర్ని నాని చిరంజీవి చేసిన ట్వీట్ పై స్పందించారు. టికెట్ల రేట్ల పెంపు అంశంపై ప‌రిశీలించి నిర్ణ‌యిస్తామ‌న్నారు. ప్ర‌జ‌ల‌కు ఇబ్బందుల్లేకుండా టికెట్ల ధ‌ర‌ల పెంపుపై సీఎంతో చ‌ర్చిస్తామ‌ని మంత్రి పేర్ని నాని అన్నారు.

తాజాగా ఏపీ ప్రభుత్వం తీసుకున్న జీవోతో.. ఇక నుంచి ఏపీలో చిన్న సినిమాలకైనా, పెద్ద సినిమాలకైనా ఒకే విధంగా టికెట్ ధరలు ఉండనున్నాయి. అలాగే, థియేటర్లలో రోజుకు నాలుగు ఆటలే ప్రదర్శించనున్న విష‌యం తెలిసిందే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement