Saturday, April 27, 2024

India Corona: దేశంలో మళ్లీ పెరిగిన కరోనా మరణాలు

దేశంలో కరోనా రోజువారి కేసులు పెరుగుతూ… తగ్గుతూ వస్తున్నాయి. నిన్న కరోనా కేసులు పెరిగగా.. ఇవాళ స్వల్పంగా తగ్గాయి. గత 24 గంటల్లో కొత్తగా 14,348 కరోనా పాజిటివ్ కేసులు బయట పడ్డాయి. వైరస్ తో 805 మంది బాధితులు చనిపోయారు. ఇదే సమయంలో 13,198 మంది కోవిడ్‌ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా నమోదైన కోవిడ్ పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,42,46,157కు చేరుకోగా… ఇందులో 3,36,27,632 మంది ఆరోగ్యవంతులైయ్యారు. దేశంలో ప్రస్తుతం 1,61,334 కేసులు యాక్టివ్ గా ఉండగా.. మొత్తం 4,57,191 మంది వైరస్ తో మృతి చెందారు.

మరోవైపు ఇప్పటివరకు పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 1,04,82,00,966 కి చేరింది. నిన్న ఒక్కరోజే 74,33,392 టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.

ఇది కూడా చదవండి: Corona fear: ఆంక్షల చట్రంలోకి ప్రపంచ దేశాలు.. లాక్ డౌన్ వైపు అడుగులు!

Advertisement

తాజా వార్తలు

Advertisement