Monday, April 29, 2024

????? ?????: దేశంలో 141.01 కోట్ల డోసుల పంపిణీ

దేశంలో రోజువారీ కరోనా కేసులు 10 వేల దిగువ నమోదు అవుతున్నాయి. తాజాగా దేశంలో గడిచిన 24 గంట్లలో కొత్త‌గా 7,189 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. నిన్న క‌రోనా నుంచి 7,286 మంది కోలుకున్నారు. అదేసమయంలో కరోనాతో 387 మంది ప్రాణాలు కోల్పోయారు.

దేశంలో ప్ర‌స్తుతం 77,032 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనా నుంచి 3,42,23,263 మంది కోలుకున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 4,79,520 మంది బాధితులు కరోనాతో మరణించారు. దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు 141.01 కోట్ల డోసుల వ్యాక్సిన్ అందించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement