Saturday, May 18, 2024

దేశంలో కరోనా అప్డేట్..కొత్తగా కేసులు ఎన్నంటే..

దేశంలో గడిచిని 24 గంటల్లో కొత్తంగా క‌రోనా 25,467 కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,24,74,773కు చేరింది. అలాగే నిన్న క‌రోనా నుంచి 39,486 మంది కోలుకున్నారు. నిన్న 354 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య మొత్తం 4,35,110కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,17,20,112 మంది కోలుకున్నారు. 3,19,551 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. అలాగే, దేశంలో నిన్న 63,85,298 వ్యాక్సిన్ డోసులు వేయగా, ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 58,89,97,805 డోసుల వ్యాక్సిన్లు వేసినట్టు అధికారులు ప్ర‌క‌టించారు.

ఇది కూడా చదవండి: అభిమానులకు శుభవార్త చెప్పిన హీరో కార్తీకేయ

Advertisement

తాజా వార్తలు

Advertisement