Sunday, May 5, 2024

దేశంలో కొత్తగా 37 వేల కరోనా కేసులు, 907 మరణాలు..

దేశంలో కరోనా సెంకడ్ వేవ్ తీవ్రత తగ్గుముఖం పడుతోంది. రోజువారీ కేసులతో పాటు మరణాలు కూడా తగ్గుతున్నాయి. దేశంలో గడిచిన గడిచిన 24 గంటల్లో 37,566 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. మరో వైపు 56,994 మంది బాధితులు కోలుకున్నారు. 24 గంటల్లో 907 మరణాలు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ పేర్కొంది. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,03,16,897కు పెరిగింది. ఇందులో 2,93,66,601 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. వైరస్‌ బారినపడి మొత్తం 3,97,637 ప్రాణాలు వదిలారని తెలిపింది. ప్రస్తుతం దేశంలో క్రియాశీల కేసులు 5,52,659 ఉన్నాయని ఆరోగ్యశాఖ వివరించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement