Tuesday, April 30, 2024

తెరపైకి మరో కొత్త జిల్లా డిమాండ్!

హుజురాబాద్ కేంద్రంగా పీవీ పేరుతో కొత్త జిల్లా ఏర్పాటు చేయాల‌న్న ప్ర‌తిపాద‌న తెర‌పైకి రావ‌డంతో.. ఇత‌ర ప్రాంతాల్లోనూ అవే డిమాండ్లు వినిపిస్తున్నాయి.  హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గం ప‌క్క‌నే ఉండే హుస్నాబాద్ కేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేయాలంటూ తాజాగా ఆందోళ‌న‌లు ఉధృత‌మ‌వుతున్నాయి. హుస్నాబాద్ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన‌ కాంగ్రెస్ నేత‌ల నుంచి ప్ర‌ధానంగా ఈ డిమాండ్ వినిపిస్తోంది. ఇప్ప‌టికే ఈ విష‌య‌మై ఆ పార్టీ నేత‌లు త‌ర‌చూ రోడ్డెక్కుతున్నారు. తాజాగా హుస్నాబాద్‌లో పీవీ జ‌యంతి ఉత్స‌వాలు నిర్వ‌హించిన కాంగ్రెస్.. మ‌రోసారి జిల్లా కోసం గ‌ళ‌మెత్తారు.

రాష్ట్ర ప్ర‌భుత్వం ఒక్క‌ నియోజకవర్గంతోనే వ‌న‌ప‌ర్తి జిల్లాను ఏర్పాటు చేసింద‌ని గుర్తు చేస్తున్న కాంగ్రెస్ నేత‌లు.. అలాగే వెనుక‌బ‌డి ప్రాంత‌మైన‌ హుస్నాబాద్ నియోజ‌క‌వ‌ర్గాన్ని కూడా ప్ర‌త్యేక జిల్లాగా ఏర్పాటు చేయాల‌ని వారు డిమాండ్ చేస్తున్నారు. పీవీ పుట్టిన ప్రాంతం ఇదే కావ‌డంతో ఆయ‌న పేరుతో ఈ జిల్లాను ఏర్పాటు చేస్తే  స‌ముచితంగా ఉంటుంద‌ని అంటున్నారు. త్వ‌రలోనే అన్ని పార్టీలతో క‌లిసి జిల్లా ఏర్పాటు కోసం ప్ర‌భుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామ‌ని అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement