Monday, April 29, 2024

దేశ వ్యాప్తంగా త‌గ్గుముఖం ప‌డుతోన్న ‘కరోనా’ కేసులు

దేశ వ్యాప్తంగా గ‌త 24గంట‌ల్లో 1,259పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. కాగా దేశంలో క‌రోనా కేసుల సంఖ్య త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. ముందు రోజు కంటే ఈ సంఖ్య కొంత తక్కువ కావడం గమనార్హం. ఇదే సమయంలో 1,705 మంది కోలుకోగా… 35 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 15,378 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 4,24,85,534 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా వల్ల ఇప్పటి వరకు 5,21,070 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశ వ్యాప్తంగా 1,83,53,90,499 డోసుల వ్యాక్సిన్ వేశారు. దేశంలో కరోనా రికవరీ రేటు 98.75 శాతంగా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement