Saturday, April 27, 2024

హాస్పటల్ లో.. ప్రధాని మోడీ తమ్ముడు

కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్న ప్రధాని మోడీ తమ్ముడు ప్రహ్లాద్ మోడీ చెన్నైలోని అపోలో ఆసుప్రతిలో జాయిన్ అయ్యారు. తమిళనాడులోని కన్యాకుమారి, మధురై, రామేశ్వరం తదితర ఆధ్యాత్మిక ప్రాంతాల పర్యటనకు ప్రహ్లాద్ మోడీ కుటుంబ సభ్యులతో కలసి వెళ్లినట్టు తెలిసింది. దామోదర్ దాస్ ముల్ చంద్ మోడీ, హీరాబెన్ దంపతులకు నాలుగో సంతానమే ప్రహ్లాద్ మోడీ. అహ్మదాబాద్ లో ఓ గ్రోసరీ స్టోర్, టైర్ షోరూమ్ నిర్వహిస్తున్నారు. గత డిసెంబర్ 27న కర్ణాటకలోని మైసూర్ సమీపంలో ప్రహ్లాద్ మోడీ ప్రమాదానికి గురయ్యారు. కుటుంబ సభ్యులతో కలసి బందీపూర్ నుంచి మైసూర్ వెళుతుండగా ఆయన కారు ప్రమాదానికి గురైంది. ఆల్ ఇండియా ఫెయిర్ ప్రైజ్ షాప్ డీలర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గా కూడా ఆయన వ్యవహరిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement