Monday, May 20, 2024

IPl | చివరాఖర్లో రస్సూల్​ మ్యాజిక్​.. పంజాబ్​పై కోల్​కతా విన్​..

కోల్​కతా, పంజాబ్​ జట్ల మధ్య ఈడెన్​ గార్డెన్స్​లో జరిగిన మ్యాచ్లో  కోల్​కతా విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్​ చేసిన పంజాబ్​ జట్టు 179 పరుగులు చేయగా.. కోల్​కతా టార్గెట్​ 180 పరుగులుగా ఉంది. అయితే.. జాసన్​ రాయ్​ (38), నితీష్​ రాణా (51) పరుగుల భాగస్వామ్యంతో పర్వాలేదు అనిపించినా.. మిగతా బ్యాటర్లు తుస్సుమన్నారు. ఒక దశలో కోల్​కతా ఓటమి ఖాయం అనుకున్న తరుణంలో అండ్రూ రస్సేల్ 23 బంతుల్లో 42 పరుగులతో​ చెలరేగి ఆడాడు.  అయితే చివరగా రెండు బంతులు ఉన్నాయనగా.. రస్సేల్​ రన్​ అవుట్​ అయ్యాడు. ఈ క్రమంలో రింకూ సింగ్​ 21 స్ట్రైకింగ్​ తీసుకుని ఫోర్​ బాదాడు. దీంతో అయిదు వికెట్ల నష్టానికి కోల్​కతా 182 పరుగులు చేసి 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement