Tuesday, April 30, 2024

15 రోజుల్లో రెస్పాండ్​ కాకుంటే, రోడ్డుమీద పార్క్​ చేసిన వాహనాలను వేలం వేస్తాం

హైద‌రాబాద్ సిటీలో రోడ్ల మీద అడ్డ‌దిడ్డంగా వ‌దిలివెళ్లే వాహ‌నాల‌పై ట్రాఫిక్ పోలీసులు సీరియ‌స్ యాక్ష‌న్‌ తీసుకుంటున్నారు. ఎంతోకాలం నుంచి రోడ్ల‌పై వ‌దిలి వెళ్లిన‌ వాహ‌నాల‌ను క్రేన్ల స‌హాయంతో ట్రాఫిక్ పోలీసు స్టేష‌న్ల‌కు త‌ర‌లిస్తున్నారు. సీజ్ చేసిన‌ వాహ‌నాల‌పై బాధిత య‌జ‌మానులు 15 రోజుల్లోగా స్పందించ‌క‌పోతే వేలం వేస్తామ‌ని తాజాగా హెచ్చ‌రించారు. రాబోయే కొద్దిరోజుల పాటు ఈ కార్య‌క్ర‌మం కొన‌సాగుతోంద‌ని తెలిపారు. రోడ్ల‌పై వ‌దిలివెళ్లిన వాహ‌నాల‌ను సంబంధిత య‌జ‌మానులు త‌క్ష‌ణ‌మే అక్క‌డ్నుంచి తీసుకెళ్లాల‌ని హైద‌రాబాద్ ట్రాఫిక్ అడిష‌న‌ల్ సీపీ రంగ‌నాథ్ సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement