Saturday, May 4, 2024

పోలీస్ వ్యవస్థ పటిష్టంగా ఉంటే.. సమాజానికి శ్రేయస్కరం.. కేసీఆర్

పోలీస్ వ్యవస్థ పటిష్టంగా ఉంటేనే సమాజానికి శ్రేయస్కరమని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. హైదరాబాద్ లో పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కమాండ్ కంట్రోల్ రూమ్ రూపకర్త డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. రెండేళ్ల క్రితమే ఈ భవనం పూర్తి కావాల్సి ఉండగా.. కరోనా వల్ల కొద్దిగా ఆలస్యమైందన్నారు. తెలంగాణలో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉందన్నారు. పోలీస్ శాఖకు ప్రభుత్వ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. రేషన్ బియ్యం దొంగలకు ముకుతాడు వేశామన్నారు. గుడుంబాను అరికట్టగలిగామన్నారు. సైబర్ క్రైమ్స్ ప్రపంచానికి సవాల్ గా మారాయన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement