Thursday, May 2, 2024

TS | ఎలక్షన్​ డ్యూటీలోకి ఐఏఎస్‌లు.. లోకేశ్‌కుమార్‌, సర్ఫరాజ్‌ అహ్మద్‌కు బాధ్యతలు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లను కేంద్ర ఎన్నికల సంఘం స్పీడప్​ చేసింది. ఇందులో భాగంగా తెలంగాణకు చెందిన ఇద్దరు ఐఏఎస్‌ అధికారులను ఎన్నికల విధుల్లోకి తీసుకున్నట్టు తెలిపింది. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోక్‌ష్‌ కుమార్‌ను అదనపు ప్రధాన ఎన్నికల అధికారిగా, ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌గా ఉన్న సర్ఫరాజ్‌ అహ్మద్‌ను సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారిగా నియమించింది.

ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఇవ్వాల (బుధవారం) ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సూచించింది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల అధికారుల బృందం మూడు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా సీఎస్‌, డీజీపీ, ఆదాయపు పన్నుల శాఖ, ఇతరశాఖలతో వరుస సమీక్షలు నిర్వహించింది. ఎన్నికల ఏర్పాట్లపై పలు సూచనలు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement