Saturday, April 27, 2024

తప్పకుండా రాజీనామా చేస్తా… కానీ ఇప్పుడు కాదు: ఈటల

మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన మాజీ మంత్రి ఈటల రాజేందర్.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే పదవికి ఎప్పుడు రాజీనామా చేస్తారన్న దానిపై ఈటల రాజేందర్ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం కరోనా వేళ ప్రజలు ఇబ్బందులో ఉన్నారని.. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాలు చేయవద్దని అన్నారు. పరిస్థితులు చక్కబడిన తర్వాత ఖచ్చితంగా రాజీనామా చేస్తానని ఈటల స్పష్టం చేశారు.

ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇటర్వూలో టీఆర్ఎస్ పార్టీతో పాటు సీఎం కేసీఆర్ పై ఈటల సంచలన విషయాలు చెప్పారు. తనను కావాలనే పిచ్చి కుక్కను చేసి మంత్రి పదవి తీసేశారని ఆవేదన వ్యక్తం చేశారు ఈటల. ఇదంతా పక్కా ప్లానింగ్ ప్రకారమే జరిగిందన్నారు. 22 సంవత్సరాలగా తో ఉన్న అనుబంధాన్ని మరచిపోయారని ఈటల తెలిపారు. తనకు ఏనాడు కూడా పదవి విషయంలో స్వేచ్చ లేదని, కనీసం సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో కలవాలంటే గేటు ముందు నిల్చోవాల్సిన పరిస్థితి ఉండేదని వాపోయారు. తనకే కాదు చాలా మంది మంత్రులు, ఎమ్మెల్యేల దుస్థితి ఇప్పటికి ఇలానే ఉందని ఆరోపించారు. ప్రగతి భవన్ లో బాతాఖానీ కొట్టేవాళ్ళు ఉంటారని విమర్శించారు. ఇక ఇపుడు జరిగిన పరిణామాలతో తనుకు సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీతో సంబంధం తెగిపోయినట్లేని ఈటల వ్యాఖ్యానించారు. కోవిడ్ సంక్షోభం ముగిసిన తర్వాత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. తర్వాత ఖచ్చితంగా గెలుస్తానన్నారు. తనను ఓడించడానికి ఎన్ని వందల కోట్లు ఖర్చు చేసిన వెనకడుగు వేసేది లేదన్నారు. గెలిచి తన సత్తా చూపిస్తాన్నారు. మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టు, ఇతర రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలపై సుప్రీంకోర్టు సీరియస్ అయిందని గుర్తు చేశారు. మనుషులు చనిపోతున్న తరుణంలో ఇప్పుడు రాజీనామా చేసి ఈ క్రీడ ఆడవద్దని అనుకుంటున్నానని తెలిపారు. ‘’కరోనా సంక్షోభం ముగిసిపోయిన తర్వాత రాజీనామా చేస్తా. ప్రజాక్షేత్రంలోకి వెళ్లి తేల్చుకుంటా. నేను భయపడే బిడ్డను కాదు. భయపడే వాడినైతే అక్కడే అడ్జస్ట్ అయ్యే వాడిని. పదవి కంటే ఆత్మగౌరవమే నాకు ఉన్నతమైనది’’ అని ఈటల వ్యాఖ్యానించారు.

ముఖ్యమంత్రి డిక్టేట్ చేస్తే కలెక్టర్లు సంతకం పెడుతారని అన్నారు.. మంత్రులకు ఏ పని చేయాలన్న స్వేచ్ఛ ఉండదని ఈటల అన్నారు. కేసీఆర్ ని కలవాలంటే సంతోష్ రావు ని కలవాల్సి వస్తుందని..సీఎం కాలవాలని ఫోన్ చేస్తే ఒక రోజు వెయిట్ చేయాల్సి వచ్చేదని పేర్కొన్నారు. సీఎం కోసం రోజుల తరబడి వెయిట్ చేయాల్సి వచ్చేది..ఇదంతా సంతోష్ రావు చేస్తాడా ? లేక పెద్దాయన చెబుతాడో తమకు తెలియదన్నారు. అయితే, తాజాగా జరిగిన పరిణామాలతో తన మనసు గాయపడిందన్నారు.

ఇక కోవిడ్ సంక్షోభం పై మాట్లాడిన ఈటల రాజేంధర్.. కరోనా పరిస్థితుల్లో తాను కష్టపడి పనిచేశానన్నారు. అయితే ఇప్పుడు కోవిడ్ ఆరోగ్య శ్రీలో చేర్చాలని తాను సీఎం కేసీఆర్ ను డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.అంతేకాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ కోవిడ్ కట్టడిపై ఇప్పుడు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని సూచించారు. ఇక కొవిడ్ మొదటి వేవ్ లో మరణాల సంఖ్య ను తక్కువ చేసి చూపారన్న ఆరోపణలపై ఈటల స్పందించారు. ప్రజల్లో భయాందోళనలు కలగకుండా కొంత మేరకు కేసులను తక్కువ చేసి చూపామన్నారు. కోవిడ్ టైంలో హైకోర్టు ప్రభుత్వానికి మొట్టికాయలు వేస్తుందని ఇప్పటికైనా ప్రభుత్వం కోవిడ్ కట్టడికి పకడ్బందీగా చర్యలు చేపట్టాలన్నారు.

ఇక ఉద్యోగులు వయోపరిమితి పెంచడం మాత్రం ముమ్మాటికీ తప్పేనని ఈటల వ్యాఖ్యానించారు. ఈ నిర్ణయనికి తాను పూర్తిగా వ్యతిరేకమన్నారు. దీనిపై ఉద్యోగులు కూడా అసంతృప్తిగా ఉన్నారని పేర్కొన్నారు. మంత్రి వర్గంలో బడ్జెట్ ప్రయారటీ ముఖ్యమంత్రి నిర్ణయిస్తారన్న ఈటల.. కాళేశ్వరానికి ఎక్కువ డబ్బుల పెట్టిన మాట వాస్తవమన్నారు. ఆ సమయంలో వెల్ఫేర్ వర్గాలకు డబ్బుల కొరత ఏర్పడిందన్నారు. ఇక తెలంగాణలో విద్యా వైద్య వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని ఆరోపించారు. ఇప్పటికైనా వీటిని మెరుగు పరచాల్సిన అవసరముందన్నారు. యూనివర్శిటీల్లో పరిస్థితి అద్వానంగా ఉందని ఈటల తెలిపారు.

- Advertisement -

కేటీఆర్ కి ముఖ్యమంత్రి పదవి అప్పజెపుతారన్న అంశంపై స్పందించిన ఈటల… ప్రాంతీయ పార్టీలు వంశపారంపర్యంగా నడుస్తాయని దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు అలానే నడుస్తున్నాయని అన్నారు. కేటీఆర్ ముఖ్యమంత్రి పదవి అప్పజెప్పడంపై తాను మద్దతు ఇచ్చానని గుర్తు చేశారు. తనకు కేటీఆర్ తో మంచి సంబంధాలే ఉన్నాయని ఈటల చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement