Tuesday, May 21, 2024

గ‌త 16ఏళ్లుగా నాకు షుగ‌ర్ ఉంది – ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకుంటా – మంత్రి కేటీఆర్

త‌న‌కి గ‌త 16ఏళ్లుగా షుగ‌ర్ ఉంద‌ని. అందుకే ఆరోగ్య‌ప‌రంగా ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకుంటాన‌ని వెల్ల‌డించారు తెలంగాణ ఐటీ,పుర‌పాల‌క‌శాఖ మంత్రి కేటీఆర్. అప్పట్లో షుగర్ పరీక్షలు చేయించుకుంటే మధుమేహం ఉందని తెలిసిందన్నారు. అందుకే ఆరోగ్యపరంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటానని, శరీర స్థితి పట్ల అప్రమత్తంగా ఉంటానని స్పష్టం చేశారు. ఆరోగ్య తెలంగాణ కార్యాచరణ గురించి మాట్లాడుతూ.. కేటీఆర్ తనకు షుగర్ ఉందన్న విషయాన్ని ప్రస్తావించారు. కాగా, ఆరోగ్య తెలంగాణ గురించి చెబుతూ, రాష్ట్ర ప్రజలకు సంబంధించి బీపీ, షుగర్, కిడ్నీ, గుండె తదితర సమాచారంతో పాటు వ్యక్తులు ఎత్తు, బరువు వంటి అంశాలను కూడా ఆరోగ్య బృందాలు సేకరిస్తాయని వెల్లడించారు. 220 బృందాలు ఇంటింటికీ వచ్చి ఈ మేరకు పరీక్షలు చేసి ఆ వివరాలను ఆన్ లైన్ లో పొందుపరుస్తారని కేటీఆర్ తెలిపారు. అంతేకాదు, ఈ బృందాలు ఇంటివద్దే కంటి పరీక్షలు, రక్త పరీక్షలు కూడా నిర్వహిస్తాయన్నారు. ఒక్కసారి ఈ విధమైన హెల్త్ ప్రొఫైల్ రూపొందించుకుంటే, ఆపై ఏ ఆసుపత్రికి వెళ్లినా స్పష్టమైన డేటా అందుబాటులో ఉండడం వల్ల మెరుగైన సేవలు పొందే అవకాశం ఉంటుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement