Thursday, May 2, 2024

Flash: భార్య చికెన్ వండలేదని ఆత్మహత్య చేసుకున్న భర్త!

చికెన్ కూర వండనన్న భార్య మీద కోపంతో ఓ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దుండిగల్‌లో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా కేతిరెడ్డిపల్లి చింతకుంటతండాకు చెందిన రతన్‌లాల్ (32), భార్య రాధిక, ఇద్దరు కుమారులు, కుమార్తెతో కలిసి దుండిగల్‌లో నివాసం ఉంటున్నారు. ఈ నెల 25న సాయంత్రం మద్యం తాగి కోడి మాంసం తీసుకుని ఇంటికెళ్లాడు. భార్య రాధికకు కూర వండమని చెప్పాడు. అయితే, కుమార్తెకు ఆటలమ్మ సోకడంతో ఇంట్లో చికెన్ వండకూడదని భర్తకు నచ్చజెప్పినా వినిపించుకోలేదు. అయితే, ఆ తర్వాతి రోజు తల్లికి ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నట్టు చెప్పాడు. ఆపై యాసిడ్ తాగి ఇంటికొచ్చాడు. తీవ్ర అస్వస్థతకు గురైన అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement