Sunday, April 28, 2024

ఉగ్ర‌వాద సంస్థ‌కి చెందిన – క‌మాండ‌ర్ ని అంత‌మొందించిన పోలీసులు

ఉగ్ర‌వాద సంస్థ‌కు చెందిన ఓ క‌మాండ‌ర్ ని కాల్చి చంపారు పోలీసులు. జ‌మ్మూక‌శ్మీర్ లోని అనంత్ నాగ్ జిల్లా రిషిపొరా ప్రాంతంలో ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఓ కమాండర్ ను కాల్చి చంపినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ ఎన్ కౌంటర్ లో ముగ్గురు సైనికులతో పాటు ఓ పౌరుడు కూడా గాయపడ్డాడని తెలిపారు. క్షతగాత్రులను వాయు మార్గంలో శ్రీనగర్ లోని సైనిక ఆసుపత్రికి తరలించారు. మరణించిన హిజ్బుల్ కమాండర్ ను నిసార్ ఖండేగా గుర్తించారు. ఈ సందర్భంగా ఓ ఏకే-47 రైఫిల్ ను, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఎన్ కౌంటర్ కొనసాగుతోందని కశ్మీర్ ఇన్ స్పెక్టర్ జనరల్ విజయ్ కుమార్ వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement