Monday, April 29, 2024

ఇద్దరు యువ‌తుల‌ సహజీవనానికి హైకోర్టు అనుమతి.. కీలక ఆదేశాలు ఏంటంటే!

కేరళ హైకోర్టుకు ఓ విచిత్రమైన కేసు వచ్చింది. ఇద్దరు అమ్మాయిలు తాము కలిసి జీవించేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును ఆశ్రయించారు. దీంతో విచారణ జరిపిన కేరళ హైకోర్టు ఆ ఇద్దరు అమ్మాయిలు (లెస్బియన్స్​) కలిసి జీవించేందుకు అనుమతించింది. కోజికోడ్‌కు చెందిన ఆదిలా నస్రిన్‌ తన ప్రియురాలు అయిన ఫాతిమా నూరాను ఆమె కుటుంబ సభ్యులు కనిపించకుండా చేశారని ఆరోపించారు. అందుకని కేరళ హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. తన భాగస్వామిని ఆమె పెద్దలు కిడ్నాప్ చేశారని యువతి హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ నేపథ్యంలో కోజికోడ్‌కు చెందిన కిడ్నాపైన యువతిని కోర్టులో హాజరుపర్చాలని కోర్టు ఆదేశించింది. అయితే, యువతి తల్లిదండ్రులను కోర్టులో హాజరు పరుస్తామని లాయర్లు కోర్టుకు తెలిపారు.

కాగా, అలువా ప్రాంతంలో నివసించే ఆదిలా నస్రిన్.. నిర్బంధంలో ఉన్న తన భాగస్వామిని విడిపించాలని, తామిద్దరం కలిసి జీవించడానికి అనుమతించాలని కోరుతూ కేరళ హైకోర్టును ఆశ్రయించారు. తనతో జీవించడం కోసం ఇంటి నుంచి వచ్చేసిన తన భాగస్వామిని ఆమె కుటుంబ సభ్యులు కిడ్నాప్ చేసి నిర్బంధించారని లెస్బియన్ అయిన ప్రియురాలు ఆదిలా పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. అఇతే.. ఆదిలా నస్రిన్ తన భాగస్వామితో కలిసి అలువాలోని బంధువుల ఇంట్లో ఉంటోంది. ఆమె ప్రియురాలి తల్లి, బంధువులు ఆరు రోజుల క్రితం అలువాలోని ఆమె ఇంటికి వెళ్లి నస్రిన్​ను తీసుకెళ్లారు. అలువా ప్రాంతానికి చెందిన ఆదిలా నస్రిన్ సౌదీ అరేబియాలో ఓ పాఠశాలలో చదువుతున్న సమయంలో తామరస్సేరీకి చెందిన 23 ఏళ్ల యువతి నూరాతో ప్రేమలో పడింది. వీరి ప్రేమ విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో అది అసహజమని వారు వ్యతిరేకించారు.

కేరళకు వచ్చిన తర్వాత ఇద్దరూ ప్రేమలో పడ్డారు. తర్వాత కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. తర్వాత ఇద్దరూ కోజికోడ్‌లో కలుసుకున్నారు. వీరిద్దరూ కోజికోడ్‌లోని షెల్టర్‌లో ఉన్నారు. తామరస్సేరీకి చెందిన బాలిక బంధువులు ఇక్కడికి వచ్చి గొడవ చేయడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. అనంతరం ఆదిలా తల్లిదండ్రులు ఇద్దరినీ అలువాలోని తమ ఇంటికి తీసుకొచ్చారు. ఓ రోజు తన బంధువులు తామరస్సేరి నుంచి వచ్చి తన భాగస్వామిని బలవంతంగా తీసుకెళ్లారని ఆదిలా చెప్పింది. పెద్దవాళ్ళలా కలిసి జీవించే హక్కు ఇద్దరికీ ఉంది. న్యాయ వ్యవస్థ ద్వారా పోలీసులు, కోర్టులు జోక్యం చేసుకోవాలని ఆదిలా కోరారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో దేశంలోని చట్టపరమైన నిబంధనల ప్రకారం దేశం స్వేచ్ఛగా కలిసి జీవించడానికి అనుమతించాలని ఆదిలా కోరుతున్నారు.

సెక్స్, పిల్లలు అనేవి పెద్ద మ్యాటర్ కాదు: షిమ్నా అజీజ్
‘‘స్వలింగ సంపర్కులైన అమ్మాయిలు కలిసి జీవించేందుకు కేరళ హైకోర్టు అనుమతినిచ్చిందన్న వార్త చదివాను. చాలా సంతోషం. ఇప్పుడు వారి ఇష్టానికే వదిలేయాలి. స్త్రీ పురుషుని పట్ల ఆకర్షితుడవ్వడం, పురుషుడు స్త్రీ పట్ల ఆకర్షితుడవ్వడం సహజమే. ఇది మన సమాజంలోని మెజారిటీ వ్యక్తుల లైంగిక ఆలోచన. కాబట్టి మెజారిటీ వ్యక్తుల లైంగిక ఆలోచన అలా ఉన్నందున స్వలింగ సంపర్కం తప్పని అభిప్రాయం ఏర్పడింది. స్వలింగ సంపర్కం అంటే ఒకే లింగానికి చెందిన వ్యక్తి పట్ల లైంగికంగా ఆకర్షితుడు అవ్వడం. ఇందులో కేవలం స్త్రీ పట్ల మాత్రమే లైంగికంగా ఆకర్షితమయ్యే స్త్రీని లెస్బియన్ అనీ, పురుషుడి పట్ల మాత్రమే లైంగికంగా ఆకర్షితుడైన పురుషుడిని గే అనీ అంటారు.

ఇక్కడ పెద్దలు ఎలా జీవిస్తారో అలాగే పిల్లలు జీవించాలని నిర్ణయించడానికి లేదు. ఇద్దరు వ్యక్తులు కలిసి జీవించడం, ప్రేమలో పడటం అనేది సెక్స్, పిల్లలను కలిగి ఉండటం మాత్రమే కాదు. ‘భాగస్వామ్యులు’ అంటే ఏ లింగానికి చెందిన వారైనా – భాగస్వామ్యం చేయొచ్చు. అది సంతోషం లేదా విచారం రెండూ కావచ్చు. ఇది వారి సౌకర్యానికి సంబంధించింది. ఈ సందర్భంలోనూ ఆదిలా, నూరాల నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది.’’ అని కేరళకు చెందిన ప్రముఖ వైద్యురాలు షిమ్నా అజీజ్ తన ఫేస్ బుక్ పేజీలో రాసుకొచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement