Thursday, May 2, 2024

విఘ్నేశ్ తో క‌లిసి – చ‌మురు సంస్థ‌ల్లో న‌య‌న‌తార పెట్టుబ‌డి – ఎన్ని కోట్లో తెలుసా

సినిమాల్లో పెట్టుబ‌డి పెడుతూనే మ‌రోప‌క్క ప‌లు బిజినెస్ ల‌లో పెట్టుబ‌డుల‌ను పెడుతోంది స్టార్ హీరోయిన్ న‌య‌న‌తార‌. ప్రియుడు, ద‌ర్శ‌కుడు విఘ్నేశ్ శివ‌న్ తో క‌లిసి ఇప్పుడు తాజాగా మ‌రో వ్యాపారంలోకి దిగింది న‌య‌న‌తార‌. దుబాయ్ లో ఓ చ‌మురు సంస్థ‌ల్లో ఇన్వెస్ట్ చేస్తుంద‌ని టాక్. అంతేకాదు ఈ మేరకు న‌య‌న్, విఘ్నేశ్ లు క‌లిసి ఏకంగా రూ.100కోట్లు స‌ద‌రు సంస్థ‌లో పెట్టుబ‌డి పెట్టిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. తనకు కాబోయే భర్త విఘ్నేశ్ తో కలిసి గ‌త నెల‌లో దుబాయ్ ట్రిప్పుకి న‌య‌న్ వెళ్లింది అందుకేనని అంటున్నారు ప‌లువురు. అయితే ఈ విష‌యంపై ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరోవైపు సినిమాలు చేస్తూనే రౌడీ పిక్చర్స్ అనే ప్రొడక్షన్ హౌస్ ను ఆమె స్థాపించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement