Sunday, May 5, 2024

Breaking: వైసీపీ ఎమ్మెల్యే అంబటికి మూడోసారి కరోనా

ఆంధ్రప్రదేశ్‌ లో కరోనా మహమ్మారి కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. సామాన్య ప్రజలు, రాజకీయ ప్రముఖులు, సినీ తారలు, సెలబ్రీటీలు కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. తాజాగా వైసీపీ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది.

ఎమ్మెల్యే అంబటి రాంబాబు కు కరోనా సోకడం ఇది మూడో సారి. నిన్న సంక్రాంతి సంబరాలలో పాల్గొన్న ఎమ్మెల్యే అంబటి రాంబాబు… ప్రజలతో కలిసి డాన్సులు చేశారు. ఇంతలోనే కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలిపారు. తనతో నిన్నటి వరకు సన్నిహితంగా ఉన్నవారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరారు. ప్రస్తుతం తాను హోం ఐసోలేషన్‌ లో ఉన్నట్లు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement