Friday, May 17, 2024

రూ.40 కోట్ల విలువైన హెరాయిన్ సీజ్​ : ఇద్ద‌రు అరెస్ట్

రూ.40కోట్ల విలువైన హెరాయిన్ ను త‌ర‌లిస్తున్న ఇద్ద‌రిని అరెస్ట్ చేసి, వారి నుంచి హెరాయిన్ ను ప‌ట్టుకొని సీజ్ చేసిన ఘ‌ట‌న ఢిల్లీలో చోటుచేసుకుంది. అంతర్జాతీయ డ్రగ్స్‌ ముఠా గుట్టును ఢిల్లీ స్పెషల్ సెల్ విభాగం అధికారులు ఛేదించారు. కారులో హెరాయిన్‌ను తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు ముఠాకు చెందిన ఇద్దరు సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.40 కోట్లు విలువైన 10 కేజీల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీన్ని మయన్మార్ నుంచి మణిపూర్ మీదుగా భారత్‌లోకి తీసుకువచ్చినట్లు గుర్తించారు. నిందితులపై ఎన్‌డీపీఎస్‌ చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement