Saturday, May 18, 2024

చంద్ర‌బాబు, లోకేష్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని – మెగాస్టార్ చిరంజీవి ట్వీట్

టిడిపి అధినేత చంద్ర‌బాబునాయుడు క‌రోనా బారిన ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఈ మేర‌కు ఆయ‌న అభిమానులు, టిడిపి నేత‌లు చంద్ర‌బాబు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని కోరారు. కాగా ఏపీ సీఎం జ‌గ‌న్ కూడా చంద్ర‌బాబుకోలుకోవాల‌ని ట్వీట్ చేశారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఈ మేర‌కు ట్వీట్ చేశారు. చంద్ర‌బాబునాయుడు, లోకేష్ త్వ‌ర‌గా క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి బ‌య‌ట‌ప‌డాలని అన్నారు. దయచేసి జాగ్రత్త వహించండి అని తెలిపారు. వారిద్ద‌రూ త్వరగా కోలుకోవాల‌ని ట్వీట్ చేశారు. కాగా ప‌లువురు సినీ సెల‌బ్రిటీలు కూడా క‌రోనా బారిన ప‌డిన సంగ‌తి తెలిసిందే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement