Saturday, May 4, 2024

యాదాద్రిలో ఏకధాటిగా వర్షం.. అస్తవ్యస్తంగా మారిన ఆలయ పరిసరాలు

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించి యాదాద్రి ఆలయంలో లోపాలు బయట పడ్డాయి. యాదగిరిగుట్టలో ఉదయం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. అకాల వర్షంతో ఆలయ పరిసరాలు అస్తవ్యస్తంగా మారాయి. రోడ్లు కొట్టుకుపోగా.. క్యూలైన్లు చెరువులను తలపిస్తున్నాయి. దీంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. రెండు గంటల పాటు ఏకధాటిగా కురిసిన వర్షానికి శ్రీలక్ష్మీ నృసింహుడి ఆలయ పరిసర ప్రాంతాల్లోనూ వరద నీరు చేరింది. యాదాద్రి ఆలయం పునర్ నిర్మాణం జరిగి నెలలు గడవకముందే ఒక్క భారీ వర్షానికే ఘాట్ రోడ్డు కుంగిపోవడం గమనార్హం. ఫలితంగా కొండపైకి రాకపోకలు నిలిచిపోయాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement