Sunday, April 28, 2024

తెలంగాణలో భానుడి సెగలు.. రెండు రోజుల పాటు జాగ్రత

తెలంగాణలో ఎండలు భగభగ మండుతున్నాయి. రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటాయి. ప్రజలు నేడు, రేపు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ రెండు రోజుల్లో ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అయితే, కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. నిన్న ఆదిలాబాద్ జిల్లా జైనద్‌లో అత్యధికంగా 45.7 డిగ్రీలు, జగిత్యాల జిల్లా ఐలాపూర్‌లో 45.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో ఈ ఏడాది నమోదైన గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇవే కావడం గమనార్హం. అలాగే, రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, వరంగల్ తదితర జిల్లాల్లోనూ సూర్యుడు తన ప్రతాపాన్ని చూపాడు. ఆయా జిల్లాల్లో గరిష్ఠంగా 44.8 నుంచి 43.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement