Monday, May 20, 2024

నిప్పుల కుంప‌టి – అయిదు జిల్లాల‌లో 45డిగ్రీ ల కంటే అధిక‌ ఉష్ణోగ్ర‌త‌లు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఎండలు మండిపోతున్నాయి… భానుడు సెగలు కక్కుతున్నాడు. నిప్పుల కుంపటిని తలపి స్తోంది. పగటి ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయిలో నమోదవుతు న్నాయి. ఉదయం 10 గంటల నుండే భానుడి ప్రతాపం మొద లవుతోంది. సాయంత్రం 5 గంటల వరకు కాలు బయటపెట్టలేని పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్నాయి. మంచిర్యాల‌,కొమ‌రం బీమ్,న‌ల్గొండ‌, జగిత్యాల‌, నిజామాబాద్. జిల్లాల‌లో సోమవారం నాడు ఏకంగా 45 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌య్యాయి. ఇక హైద‌రాబాద్ లోనూ ఎండ‌లు ఠారెత్తిస్తున్నాయి.. 42 ఢిగ్రీల ఉష్ణోగ్ర‌త‌ల‌తో భాగ్య న‌గ‌రం ప్ర‌జ‌లు అల్లాడిపోతున్నారు. కరీంనగర్‌, జగిత్యాల, ఖమ్మం, నిజామాబాద్‌ జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు గరిష్టస్థాయికి చేరుకున్నాయి ప్రతి రోజూ ఈ జిల్లాల్లో 45 డిగ్రీ లపైనే పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వారం క్రితం వరకు అకాల వర్షాలతో నడు వేసవిలో వానాకాలాన్ని తలపిం చిన వాతావరణంలో నాలుగు రోజులుగా అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు లేని స్థాయిలో పలు జిల్లాల్లో గరిష్ణ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావవరణశాఖ అధికారులు చెబుతున్నారు.
ఆదివారం పలు జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణశాఖ వెల్లడించింది. మంచిర్యాల జిల్లా కొండాపూర్‌లో గరిష్టంగా 45.9 డిగ్రీలు, జన్నారంలో 45.8, జగిత్యాల జిల్లా జైనాలో 45.5, కొమురంభీం ఆసీఫాబాద్‌ కెరమెరిలో 45.4 డిగ్రీలు, నిజామాబాద్‌ జిల్లా ముష్కల్‌లో 45.1, నల్గొండ జిల్లా పజ్జూరులో 45, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గరిమెల్లపాడులో 44.9, ములుగు జిల్లా తాడ్వాయిలో 44.8 డిగ్రీలు, ఆదిలాబాద్‌ జిల్లా ఆర్లి(టీ)లో 44.8, పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్‌లో 44.8, కరీంనగర్‌ జిల్లా గంగిపల్లిలో 44.8 డిగ్రీలు, నిర్మల్‌ జిల్లా బుట్టాపూర్‌లో 44.7డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.


వాయువ్య దిశ నుంచి దిగువస్థాయి గాలులు వీస్తున్నా యని, వీటి ప్రభావంతో రానున్న వారం రోజుల్లో ఎండ తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తు న్నారు. రానున్న రోజుల్లో సాధారణం కన్నా నాలుగు నుంచి అయిదు ఢిగ్రీలు మేర ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని తెలిపారు. హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో దాదాపు 43 డిగ్రీల దాకా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొన్నారు. వారంపాటు హైదరాబాద్‌ పరిధిలో గరిష్ట ఉష్ణోగ్రత 42 డిగ్రీల వరకు ఉంటుందని వెల్లడించారు. భానుడి ప్రతాపానికి ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు వీధులన్నీ నిర్మా నుషంగా మారిపోతున్నాయి. నిత్యం ప్రయాణికులతో కిటకి టలాడే బస్టాండ్లు, ప్రధాన కూడళ్లు జన సంచారం లేక బోసి పోతున్నాయి. సాయంత్రం 5 దాటినా ఎండ తీవ్రత తగ్గడం లేదు. రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. అత్య‌వ‌స‌ర‌మైతే త‌ప్ప ప‌గ‌టి పూట ఇళ్ల నుంచి ప్ర‌జ‌లు బ‌య‌ట‌కు రావ‌ద్ద‌ని అధికారులు హెచ్చ‌రికలు జారీ చేశారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement