Friday, May 3, 2024

రోహిత్ రెడ్డి పిటిషన్ విచారణ జనవరి 5కు వాయిదా..

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి రిట్ పిటిషన్ పై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. పూర్తి వివరాలతో ఈడీ కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు తెలిపింది. ఈ ఎపిసోడ్ లో ఎక్కడా డబ్బు దొరకలేదని రోహిత్ రెడ్డి లాయర్ నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. మనీ లాండరింగ్ జరగనప్పుడు ఎలా విచారిస్తారంటూ వాదించారు. ఈనెల 30న విచారణకు రావాలని రోహిత్ రెడ్డికి నోటీసులు ఇచ్చినట్లు ఈడీ తెలిపింది. ఈసీఐఆర్ నమోదు చేస్తే అభ్యంతరం ఎందుకని హైకోర్టు తెలిపింది. అనంతరం తదుపరి విచారణ జనవరి 5వతేదీకి హైకోర్టు వాయిదా వేసింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement