Sunday, May 5, 2024

మడ అడవులను సందర్శించిన జీ 20దేశాల అధినేతలు.. సెంటరాఫ్ అట్రాక్షన్ గా మోడీ

ఇండోనేషియాలోని బాలిలో ఆ దేశ ప్రభుత్వం 13వందల ఎకరాల విస్తీర్ణంలో మడ అడవులను పెంచుతోంది. కాగా ఈ అడవులను సందర్శించేందుకు జీ20 దేశాల అధినేతలు తరలి వెళ్లారు.జీ 20సదస్సు కోసం భారత్, అమెరికా సహా పలు దేశాల అధినేతలు ప్రస్తుతం ఇండోనేషియాలో వాలిపోయారు.సోమవారం రాత్రికే బాలి చేరుకున్న ఆయా దేశాధినేతలు… మంగళవారం తొలి రోజు సమావేశాల్లో మునిగిపోయారు. అంతుకుముందు కుశల ప్రశ్నలతో ఒకరినొకరు పలకరించుకున్న దేశాధినేతలు ఫొటోలకు ఫోజులిచ్చారు.

తాజాగా సదస్సుకు హాజరైన దేశాల అధినేతలంతా బుధవారం ఇండోనేషియాలోని అతి పెద్ద మడ అడవులను సందర్శించారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ లతో పాటు సదస్సుకు హాజరైన అన్ని దేశాల అధినేతలు ఈ పర్యటనలో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా అందరూ సాదాసీదాగా రాగా…. మోడీ ఒక్కరు మాత్రమే తన అధికారిక సూట్ లో ఈ పర్యటనలో పాల్గొనడం గమనార్హం. ఫలితంగా ఈ పర్యటనలో మోదీ సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. ఈ సందర్భంగా జీ20 దేశాల అధినేతలు అక్కడ ఒక్కో మొక్కను నాటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement