Thursday, May 2, 2024

భార్య ఆత్మహత్య కేసులో జైలుకు.. ఆమెను మరిచిపోలేక ప్రేమికుల రోజున ఖైదీ ఆత్మహత్యాయత్నం

భార్య ఆత్మహత్య కేసులో అతడే ప్రధాన నిందితుడు. కానీ, ఇవాళ (ఫిబ్రవరి 14) ప్రేమికుల దినోత్సవం రోజున భార్య గుర్తుకు వచ్చిందంటూ జైల్లోనే ఉరేసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది.

సంగారెడ్డి జిల్లాకు చెందిన భానుచందర్ (24) భార్య ఈ మధ్యనే సూసైడ్​ చేసుకుంది. ఆమె ఆత్మహత్యకు భర్త వేధింపులే కారణమని ఫిర్యాదు రావడంతో పోలీసులు అతనిపై కేసు పెట్టారు. బానుచందర్ కు కోర్టు రిమాండ్ విధించడంతో ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా జైలులో ఉన్నాడు. అయితే ఇవాళ (సోమవారం) జైలు గదిలోనే బెడ్ షీట్ ను ఉపయోగించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డట్టు తెలుస్తోంది. వెంటనే విధుల్లో ఉన్న పోలీసులు గమనించి బానుప్రసాద్ ను కాపాడారు. అప్పటికే అతడు అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో చికిత్స నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. అతడి పరిస్థితి విషమంగానే ఉన్నట్లు సమాచారం.

భార్య గుర్తుకురావడం వల్లే ప్రేమికుల దినోత్సవం రోజు అతను ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే భార్య ఆత్మహత్య కారణమయ్యాడని జైలుపాలయిన వ్యక్తి భార్య గుర్తుకువచ్చిందంటూ ప్రేమికుల రోజుల ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం గమనార్హం.

భార్య కోపాన్ని భరించలేక మరో వ్యక్తి..
ఇదిలావుంటే.. మరిదితో గొడవపడిన మహిళ ఆ కోపాన్ని భర్తపై ప్రదర్శించడంతో తీవ్ర మనస్తాపానికి గురయిన మరో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తెలంగాణ రాజధాని హైదరాబాద్ మహానగరంలోని ఆల్వాల్ లో జరిగింది. ఆల్వాల్ లో నివసించే అంజయ్య(32) జిహెచ్ఎంసి చెత్త తరలింపు వాహనం డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. కొంతకాలం క్రితం తండ్రి, తమ్ముడి వద్ద అప్పు తీసుకుని సొంతంగా ఇళ్లు కట్టుకున్నాడు. అయితే సకాలంలో ఈ అప్పు చెల్లించకపోవడంతో కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో నిన్న మధ్యాహ్నం అంజయ్య తమ్ముడు అప్పిచ్చిన డబ్బుల కోసం వదిన లక్ష్మమ్మ తో గొడవ పడ్డాడు. తీవ్రంగా వాగ్వాదం జరిగింది. దీంతో సాయంత్రం ఇంటికి వచ్చిన భర్తకు ఆమె జరిగిన గొడవ మొత్తం చెప్పింది.. ఇలా మాటలు పడడానికి, గొడవకు భర్తే కారణం అని కోప్పడింది. దీంతో మనస్థాపంతో అంజయ్య ఇంట్లో ఉరి వేసుకున్నాడు.

గతేడాది ఆగస్ట్ లో ఇలాగే భార్య వేధింపులు తట్టుకోలేక భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన ఖమ్మంలో వెలుగుచూసింది. భార్య వివాహేతర సంబంధం పెట్టుకుని తనను మానసికంగా వేధిస్తుందనే కారణంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఖమ్మం జిల్లా కొణిజర్లలోని రామనర్సయ్యనగర్ లో ఈ దారుణం చోటుచేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement