Sunday, May 5, 2024

బాలిక‌ను బైక్‌పై ఎక్కించుకుని, పొలంలోకి తీసుకెళ్లి ఆ పనిచేశాడు

ప‌దో త‌ర‌గ‌తి చ‌దివే ఓ బాలిక‌పై 23 ఏళ్ల యువ‌కుడు ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ ఘ‌ట‌న క‌ర్నాట‌క‌లో వెలుగుచూసింది. నిందితుడిని అలిఖ‌న్వ‌ర్‌గా గుర్తించిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. బాలిక‌ను బ‌ల‌వంతంగా త‌న బైక్‌పై ఎక్కించుకున్న నిందితుడు ఆమెను పొలంలోకి తీసుక‌వెళ్లి దారుణానికి పాల్పడ్డట్టు పోలీసులు తెలిపారు. బాలిక‌పై ప‌లుమార్లు లైంగిక దాడికి పాల్ప‌డిన నిందితుడు ఈ విష‌యం ఎవ‌రికైనా చెబితే చంపేస్తాన‌ని బెదిరించాడు.

ఈ విష‌యం తెలియ‌గానే బాలిక కుటుంబ‌స‌భ్యులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. త‌క్ష‌ణ‌మే రంగంలోకి దిగిన పోలీసులు కేసు న‌మోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. ఇక మ‌రో ఘ‌ట‌న‌లో బెంగ‌ళూర్‌లో 16 ఏళ్ల బాలిక‌కు మత్తుమందు ఇచ్చి న‌లుగురు వ్య‌క్తులు ఆరు రోజుల పాటు లైంగిక దాడికి పాల్ప‌డిన ఘ‌ట‌న క‌ల‌కలం రేపింది. కాగా, నిందితులంద‌రినీ బెంగ‌ళూర్ పోలీసులు అరెస్ట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement