Wednesday, May 1, 2024

నెక్ట్స్ షెడ్యూల్ కి సిద్ధ‌మ‌వుతోన్న ‘హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు’

క్రిష్ తెర‌కెక్కిస్తోన్న చిత్రం హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు. ఈ చిత్రంలో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టిస్తున్నాడు. మెగా సూర్య ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై ఎ.ఎమ్ ర‌త్నం నిర్మిస్తున్నాడు. కాగా ఇప్పటికే ఈ సినిమా 50 శాతం చిత్రీకరణను జరుపుకుంది. కరోనా ప్రభావం తీవ్రంగా ఉండటం వలన .. ‘భీమ్లా నాయక్’ను ముందుగా పూర్తి చేద్దామని పవన్ అనుకోవడం వలన, ‘వీరమల్లు’ షూటింగు కొంతకాలంగా ఆపడం జరిగింది. ఈ లోగా మరిన్ని భారీ సెట్లను కూడా క్రిష్ దగ్గరుండి పూర్తి చేయిస్తున్నారు. ఇక వచ్చేనెల నుంచి తదుపరి షెడ్యూల్ ను మొదలుపెట్టే ఆలోచన చేశారట‌. మార్చి 18వ తేదీ నుంచి నెక్స్ట్ షెడ్యూల్ మొదలవుతుందట‌. ఇక ఈ సారి ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా చకచకా మిగతా 50 శాతం చిత్రీకరణను జరిపేలా ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. నిధి అగర్వాల్ ఈ సినిమాలో కథానాయికగా అందాల సందడి చేయనుంది. ఇతర ముఖ్య పాత్రల్లో అర్జున్ రాంపాల్ .. ఆదిత్య మీనన్ .. శుభలేఖ సుధాకర్ కనిపించనున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement