Thursday, May 2, 2024

వినూత్నంగా దేశ‌భ‌క్తి-జాగ్వార్ కారుని జాతీయ‌జెండాలా మార్చిన సిద్ధార్థ జోషి

ఢిల్లీలో ఓ వ్య‌క్తి వినూత్నంగా దేశ‌భ‌క్తిని చాటుకున్నాడు.. గుజరాత్ లోని సూరత్ కు చెందిన సిద్ధార్థ జోషి.. తన ఖరీదైన జాగ్వార్ కారుకు జాతీయ జెండా రంగులు వేయించాడు. కారు బ్యానెట్ తో పాటు డోర్లు మీద ‘ఆజాదీకా అమృత్ మహోత్సవ్’, ‘హర్ ఘర్ తిరంగా’ ప్రచార లోగోలను పెయింట్ వేయించాడు. దీని కోసం రెండు లక్షల రూపాయల వరకు ఖర్చు చేశాడు. కారును అందంగా ముస్తాబు చేసిన తర్వాత… అందులో కుటుంబ సమేతంగా దేశ రాజధాని ఢిల్లీకి పయనమయ్యారు. సూరత్ నుంచి 1,300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఢిల్లీని రెండు రోజుల్లో చేరుకున్నారు. పార్లమెంట్ దగ్గర కారుతో చక్కర్లు కొట్టారు. ప్రధాని మోడీతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలుసుకోవాలని ఉందని తమ మనసులోని కోరికను బయటపెట్టాడు. త్రివర్ణ పతాకం రంగులో ఉన్న ఈ కారు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement