Monday, April 29, 2024

Big Breaking | తుపాకీ కలకలం.. ఇరిగేషన్ ఉద్యోగిపై దాడి

కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో తుపాకీ కలకలం సృష్టించింది. బుధవారం అర్థరాత్రి మానకొండూర్ కు చెందిన బాసబోయిన అరుణ్ మీద ముగ్గురు వ్యక్తులు దాడిచేసి తపంచాతో బెదిరించినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. యాదగిరిగుట్టకు చెందిన మల్లేశంను అదుపులోకి తీసుకొని కరీంనగర్ రూరల్ ఏసిపి కర్ణాకర్ రావు, మానకొండూరు సిఐ రాజ్ కుమార్ విచారిస్తున్నట్లు సమాచారం.

ఈ దాడిలో గోదావరిఖనికి చెందిన బన్నీతో పాటు చంటి ఉన్నట్లు తెలిసింది. నిందితులు తపంచా వాడినట్లు పోలీసులు గుర్తించారు. సంఘటనా స్థలంలో పోలీసులు ఒక బుల్లెట్ స్వాధీనం చేసుకున్నారు. అరుణ్ పై బీరు సీసాతో దాడి చేసి తర్వాత తపాంచాతో హల్చల్ చేసినట్లు తెలిసింది. అరుణ్ మహబూబాబాద్ లో ఇరిగేషన్ శాఖలో అటెండర్ గా పనిచేస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement