Monday, April 29, 2024

జీఆర్ఎంబీ సమావేశానికి ఏపీ అధికారులు డుమ్మా!

గోదావ‌రి న‌దీ జ‌లాలపై నెల‌కొన్న వివాదాల ప‌రిష్కారం కోసం భేటీ అయిన గోదావ‌రి న‌దీ జ‌లాల యాజమాన్య సంస్థ (జీఆర్ఎంబీ) స‌మావేశం మ‌రోమారు వాయిదా పడింది. హైద‌రాబాద్‌లోని జ‌ల‌సౌధ‌లో శుక్ర‌వారం మొదలైన ఈ స‌మావేశానికి తెలంగాణ ప్ర‌తినిధి బృందం హాజ‌రైనా… ఏపీ నుంచి ప్ర‌తినిధులెవ్వ‌రూ హాజ‌రు కాలేదు. దీంతో ఏపీ ప్ర‌తినిధుల కోసం కాసేపు వేచి చూసిన బోర్డు… ఏపీ అధికారులు రాకపోవడంతో స‌మావేశాన్ని వాయిదా వేసింది.

ఈ స‌మావేశంలో గోదావ‌రి న‌దీ జ‌లాల పంపిణీ, గోదావ‌రిపై నిర్మిస్తున్న ప్రాజెక్టులు, వాటి ప‌ర్య‌వేక్ష‌ణ బాధ్య‌త‌ల‌ను బోర్డుకు అప్ప‌గించడం వంటి కీల‌క అంశాల‌పై చ‌ర్చ జ‌ర‌గాల్సి ఉంది. ఈ స‌మావేశానికి సంబంధించి ఏపీ ప్ర‌భుత్వానికి బోర్డు నుంచి ముందుగానే స‌మాచారం వెళ్లింది. అయితే ఈ స‌మావేశానికి తాను గైర్హాజ‌ర‌వుతున్న‌ట్లు ఏపీ ప్రభుత్వం బోర్డుకు స‌మాచారం ఇవ్వ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement