Thursday, May 16, 2024

Flash: గడ్చిరోలిలో నలుగురు మావోయిస్టులు అరెస్ట్

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో టాక్టికల్ కౌంటర్ ఆఫెన్సివ్ క్యాంపెయింగ్ పోలీసులు నలుగురు మావోయిస్టులను అరెస్ట్ చేశారు. ధోడ్ రాజ్ పరిడాని నెలగుండ అడవిలో యాంటీ మావోయిస్ట్ ఆపరేషన్ కొనసాగిస్తుండగా విశ్వాసనీయ సమాచారం ప్రకారం పోలీసులు ఈ అరెస్టులు చేశారు. సీపీఐ మావోయిస్ట్ గ్రూప్ కి చెందిన నక్సల్స్ నెలగొండ గ్రామ పరిధిలో సంచరిస్తుండగా గుర్తించారు. పట్టుబడిన వారిలో బాపు అలియాస్ రామాజీ దొఘే, మరోటి అలియాస్ అంతురాం, సుమన్ అలియాస్జన్ని కోమటి కుడ్యమి, అజిత్ అలియాస్ భరత్ మైన హిచామి ఉన్నారు. వీరిపై మొత్తం రూ.18 లక్షల రివార్డ్ ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు. ఈ నలుగురి మావోయిస్టులపై పలు దోపిడీలు, హత్యలు, ఎన్కౌంటర్ లు వంటి కేసులు నమోదులో ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement