Monday, April 29, 2024

డ్వాక్రా మహిళలకు మూడో విడత రూ.1261కోట్లు చెల్లిస్తున్నాం – సీఎం జగన్

డ్వాక్రా మహిళలకు మూడో విడత సున్నా వడ్డీ కింద రూ.1261కోట్లు చెల్లిస్తున్నామని, మహిళాలకు అండగా వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం నిలుస్తుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఒంగోలు బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. సాధికారత సారధులకు అభినందనలు. తొలి ఏడాది సున్నా వడ్డీ కింద రూ.1258 కోట్లు చెల్లించాం. రెండో ఏడాది సున్నా వడ్డీ కింద రూ.1096 కోట్లు చెల్లించామన్నారు. వరుసగా మూడో ఏడాది రూ. 1261 కోట్లు చెల్లిస్తున్నామని అన్నారు. గడిచిన మూడేళ్లలో రూ.3165 కోట్లు అక్కాచెల్లెమ్మలకు చెల్లించామన్నారు. కోటి 2లక్షల 16 వేలమందికి పైగా అక్క చెల్లెమ్మలకు మేలు కలిగింది. గతంలో 12శాతం దాకా వడ్డీలు కట్టాల్సి వచ్చేదన్నారు. అక్కచెల్లెమ్మలకు మంచి జరగాలని గత ప్రభుత్వం ఆలోచించలేదన్నారు. సున్నా వడ్డీ పథకాన్ని గత ప్రభుత్వం రద్దు చేసిన పరిస్థితులున్నాయి. కానీ మన ప్రభుత్వంలో ప్రతి ఏడాది మహిళలకు భరోసా ఇస్తున్నామని సీఎం జగన్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement