Thursday, May 2, 2024

Telangana: బీజేపీ లీడర్​లా వ్యవహరిస్తున్న గవర్నర్​.. మంత్రి సత్యవతి సీరియస్​ కామెంట్స్​

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తీరు బీజేపీ లీడర్​లా ఉందని, ఆమె ఓ గవర్నర్​లా కాకుండా రాజకీయ నాయకురాలిలా వ్యవహరిస్తున్నరని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. గవర్నర్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి సత్యవతి రాథోడ్ కౌంటరిచ్చారు. ఎవరికి ఎవరు దూరమయ్యారో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్​ తనకు తానే ప్రశ్నించుకోవాలన్నారు సత్యవతి. ఈ ప్రశ్నలన్నీ గవర్నరే వేసుకోవాలన్నారు. స్థాయి మరిచిపోయి ఆమె కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు మంత్రి సత్యతవి. గతంలో ఉన్న గవర్నర్లతో రాని సమస్య ఇప్పటి గవర్నర్ కే ఎందుకు వస్తోందన్నది ఆమె సమీక్షించుకోవాలన్నారు. గవర్నర్ పరిధి ఏంటో తెలుసుకుని వ్యవహరిస్తే అందరికీ మంచి జరుగుతుందన్నారు సత్యవతి

Advertisement

తాజా వార్తలు

Advertisement